విజయవాడ: విజయవాడ తెదేపా ఎంపీ కేశినేని నానికి కొవిడ్ పాజిటివ్గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నట్టు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు హోం క్వారంటైన్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.