ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా మరణాల్లో 3వ స్థానంలో భారత్!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 06, 2020, 04:44 PM

భారత్ ఇప్పుడు కరోనా డేంజర్ జోన్‌లో ఉంది. రికవరీ కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వాలు చెబుతున్నా మొత్తంగా కేసులు పెరిగిపోవడం ఆందోళన కలిగించే విషయం. ఇండియాలో గత 24 గంటల్లో మరో 24248 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 7 లక్షలకు చేరువైంది. ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 697287గా నమోదైంది. తాజాగా 24 గంటల్లో 425 మంది కరోనా వల్ల చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 19693కి చేరింది. కేంద్ర హెల్త్ బులెటిన్ నివేదిక ప్రకారం.. గత 24 గంటల్లో 15350 కేసులు రికవరీ అవ్వడంతో మొత్తం రికవరీల సంఖ్య 424432కి పెరిగింది. ప్రస్తుతం 253287 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.ప్రస్తుతం టాప్‌లో ఉన్న అమెరికాలో నిన్న 42431 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 2980829కి పెరిగాయి. అలాగే నిన్న 234 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 132552కి పెరిగింది. అమెరికా తర్వాత అత్యధిక కేసులు బ్రెజిల్‌లో నమోదయ్యాయి. నిన్న 24431 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1603055కి పెరిగింది. నిన్న కొత్తగా 502 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 64867కి పెరిగింది.కరోనా మొత్తం కేసుల్లో ఇండియా... అమెరికా, బ్రెజిల్ తర్వాత మూడోస్థానంలో ఉంది. అలాగే రోజువారీ నమోదవుతున్న కేసుల్లో కూడా మూడోస్థానానికి చేరింది. అలాగే మొత్తం మరణాల్లో ఇండియా రోజూలాగే 8వ స్థానంలో కొనసాగుతూ రోజువారీ మరణాల్లో భారత్ మూడోస్థానంలో ఉంది. ప్రస్తుతం ఇదే ఆందోళన కలిగించే అంశం. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో భయాందోళన నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com