టెక్నాలజీకి పెట్టింది పేరైన జపాన్ చాలాకాలంగా భారత్ కు మిత్రదేశం. మన దేశంతో చైనాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, చైనాతో సరిహద్దు వివాదంలో భారత్ కు జపాన్ మద్దతుగా నిలిచింది. వాస్తవ నియంత్రణ రేఖను మార్చే ఎలాంటి ఏకపక్ష ప్రయత్నాన్ని అయినా తాము వ్యతిరేకిస్తామని పరోక్షంగా చైనాను ఉద్దేశించి జపాన్ కీలక వాఖ్యలు చేసింది. ఇటీవల గాల్వన్ లోయ వద్ద జరిగిన పరిణామాలను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా జపాన్ రాయబారి సతోషి సుజుకీకి ఫోన్ ద్వారా వివరించారు. దీనిపై సుజుకీ స్పందిస్తూ, భారత్-చైనా ఈ వివాదాన్ని చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్న భారత్ విధానాలను జపాన్ ప్రశంసిస్తోందని ఆయన తమ దేశ వైఖరిని స్పష్టం చేశారు.