దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ వైరస్ ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించకపోవడంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జాగ్రత్తలు పాటిస్తూనే ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఇప్పటికే 65 ఏళ్లు పైబడిన వారందరికీ పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించిన ఈసీ తాజాగా.. ఈవీఎం బటన్ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా చిన్న కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయించింది.ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ మధ్య జరగున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానం ద్వారా ఓటింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే వారికి ఖాదీ మాస్కులతో పాటు శాటిటైజర్ కూడా అందించాలని ఈసీ ఆలోచిస్తోంది. ఓటింగ్ కేంద్రాల్లో తక్కువ మంది ఉండేలా 45 శాతం అధికంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.