ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ. 300 కోట్ల స్కాం.. ముగ్గురి అరెస్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 05, 2020, 10:07 AM

సంచలనం సృష్టించిన స్వధాత్రి రియల్ ఎస్టేట్ స్కాంలో ముగ్గురు నిందితులను హైదరాబాదు పోలీసులు అరెస్ట్ చేశారు. స్కాంలో కీలకమైన రఘు, మీనాక్షి, శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 3 వేల మందికి కుచ్చుటోపీ పెట్టి వారి నుంచి వసూలు చేసిన డబ్బుతో భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించారు.రూ.300 కోట్ల మేర స్కాం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజల సొమ్ముతో భూములు కొన్న స్వధాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ ఆ భూములను అమ్ముకుంది. బ్రోకర్లు, ఏజెంట్ల ద్వారా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన స్వధాత్రి యజమాని యార్లగడ్డ రఘు మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొనసాగించారు. ఈ స్కాంలో ఏజెంట్లపైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com