సంచలనం సృష్టించిన స్వధాత్రి రియల్ ఎస్టేట్ స్కాంలో ముగ్గురు నిందితులను హైదరాబాదు పోలీసులు అరెస్ట్ చేశారు. స్కాంలో కీలకమైన రఘు, మీనాక్షి, శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 3 వేల మందికి కుచ్చుటోపీ పెట్టి వారి నుంచి వసూలు చేసిన డబ్బుతో భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించారు.రూ.300 కోట్ల మేర స్కాం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజల సొమ్ముతో భూములు కొన్న స్వధాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ ఆ భూములను అమ్ముకుంది. బ్రోకర్లు, ఏజెంట్ల ద్వారా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన స్వధాత్రి యజమాని యార్లగడ్డ రఘు మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొనసాగించారు. ఈ స్కాంలో ఏజెంట్లపైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.