కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని గూడూరు పోలీసు స్టేషన్ పరిధిలోని సుంకేసుల చెక్ పోస్టు వద్ద జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్, స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో గౌతమి సాలి ఆదేశాల మేరకు గూడూరు ఎస్సై నాగార్జున ఆధ్వర్యంలో వారి సిబ్బందితో కలిసి శనివారం తెలంగాణ నుంచి అక్రమంగా ఆంధ్రలోకి తరలిస్తున్న వారిపై దాడులు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో తెలంగాణ రాష్ట్రంలో రాజోలి, అలంపూర్ గ్రామాల నుంచి అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యంను ఎస్సై నాగార్జున వారి టీం సభ్యులు గుర్తించారు. అనుమానంగా సంచరిస్తున్న వారిని గుర్తించి తనిఖీలు చేయగా 16 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకోని గూడూరు, కొత్తకోట గ్రామాలకు చెందిన తెలుగు కాశీం, తెలుగు రఘు, బోయ అంజనేయులు అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగార్జున తెలిపారు..