ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాయుసేనకు మరిన్ని అస్త్రాలు

national |  Suryaa Desk  | Published : Thu, Jul 02, 2020, 07:47 PM

ఒక వైపు పాకిస్తాన్ ఉగ్రవాదం ఎగుమతులు, మరోవైపు చైనా సరిహద్దు వద్ద కయ్యానికి దిగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మన దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం వ్యూహాలు రచిస్తోంది. రక్షణ శాఖ అమ్ముల పొదిలోకి మరిన్ని సరికొత్త అస్త్రాలను చేర్చేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇప్పటికే జూలై నెలాఖరుకు తొలి విడతగా 6 రఫేల్ యుద్ధ విమానాలు చేరుకోనుండగా.. తాజాగా మరో కీలక ఒప్పందం చేసుకుంది. రష్యా నుంచి 33 కొత్త యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనలకు రక్షణశాఖ ఆమోద ముద్రవేసింది. రూ. 18,148 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టున్నారు. రష్యా నుంచి 12 Su-30MKI (సుఖోయ్) యుద్ధ విమానాలతో పాటు మరో 21 MiG-29 (మిగ్) యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు ప్రస్తుతం మన వద్ద ఉన్న 59 మిగ్-29 విమానాలను ఆధునీకరించనుంది. అంతేకాకుండా భారత వాయుసేన, నౌకాదళానికి అదనంగా 248 అస్త్ర ఎయిర్ టూ ఎయిర్ మిసైల్స్‌ను సమకూర్చనుంది. వీటితో పాటు వేయి కి.మీ. దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగల లాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్‌ తయారీకి రక్షణశాఖ ఓకే చెప్పింది. ఈ క్షిపణులను డీఆర్డీవో తయారుచేయనుంది. ఇవి త్రివిద దళాలకు చేరితే భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com