ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీలు ప్రచారాల జోరును పెంచాయి. మరోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఆయా పార్టీ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అయితే ఓ వైపు ఎన్నికల ప్రచారం జరుగుతుండగా.. ఇప్పటికే కీలక నేతలు పార్టీకి రాజీనామా చేశారు. మరికొందరు కూడా వారి బాటలోనే నడుస్తున్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మాజీ జడ్పీటీసీ కన్నా నాగరాజు తెలుగుదేశం పార్టీలో చేరారు. అలానే మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేస్తున్న కన్నా నాగరాజు భార్య జ్యోతి మచిలీపట్నంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.