ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సతీమణి శిరీష ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తన భర్తను గెలిపించాలని కోరుతూ శిరీష ప్రచారం చేస్తున్నారు. గడప గడపకు తిరుగుతూ ఎన్డీఏ ప్రభుత్వం వల్ల కలిగే ప్రయోజనాలు ఎమ్మెల్యే భార్య వివరిస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలను మహిళలు, పేదలకు వివరిస్తూ కృష్ణ ప్రసాద్ సతీమణి ప్రచారం నిర్వహిస్తున్నారు. శిరీషతో ఎన్నికల ప్రచారంలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొంటున్నారు.