కర్నూల్ జిల్లా నంద్యాలలోని ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలో విషాదం నెలకొంది. ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీకై ఒకరు మరణించగా అనేక మంది అస్వస్థతకు గురయ్యారని సమాచారం. ఫ్యాక్టరీలో అనేక మంది కార్మికులు ఉన్నారు. ఫ్యాక్టరీ వద్దకు ఫైర్ సిబ్బంది,అంబులెన్స్ చేరుకున్నాయి. సహాయక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటికే అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ లీక్ తో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పది రోజుల క్రితమే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కంపెనీకి నోటిసులు ఇచ్చింది. ఇంతలోనే ఈ ఘటన జరిగింది.