విజయవాడ : ఆర్టీసీలో ఏ ఒక్క కాంట్రాక్టు/అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని తొలగించడం లేదు. ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ మాట్లాడుతూ ...మే 22 నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీలో 19 మంది సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. సిబ్బంది ఆరోగ్యం భద్రతా చర్యలకు అనుగుణంగా కొన్నిమార్గదర్శకాలు జారీ చేశాం. వైరస్ వ్యాప్తిని ఆపడానికి కార్యాలయంలో ఉద్యోగులు "బేర్ మినిమమ్" పరిమితం చేశాం. ప్రస్తుతం ఆర్టీసీలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కూడా నడవడంలేదు. కోవిడ్ వ్యాప్తి నివారణ దృష్ట్యా అవసరమైన వారిని మాత్రమే విధులకు పిలుస్తున్నాం. సంస్థలోని అవుట్ సోర్సింగ్/ కాంట్రాక్టు సిబ్బందిలో ఏ ఒక్కరి ఉద్యోగం రద్దు కాదు. కరోనా వల్ల ఆర్టీసీ ఆదాయం గణనీయంగా తగ్గింది. ఈ అంశాన్ని మంత్రి పేర్నినాని, సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తాం. వారి సూచనల మేరకు తగు నిర్ణయం తీసుకుంటాం