ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 26, 2020, 03:48 PM

వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా తీసుకొచ్చిన ఇసుక పాలసీతో రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలకు సంబంధించిన ఇసుక మాఫీయా కోట్లకు పడగలెత్తిందని లోకేశ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ సాయిరెడ్డి ట్విటర్లో లోకేశ్‌పై మండిపడ్డారు.
'మాలోకం కళ్లన్నీ ఇసుక మీదే. అప్పట్లో శాండ్ మాఫియా నుంచి నెలనెలా మామూళ్లు అందుకునే వాడు. ఇప్పుడా ఆదాయం పోయిందని ఏడుపు. హైదరాబాద్‌లో కూర్చుని ఉచిత సలహాలు ఇవ్వకుండా ఇక్కడి కొచ్చి సమస్యను స్టడీ చేసి మాట్లాడు. ఎక్కడో ఒక ఘటనను చూపి ఇలాగే జరుగుతోందని అంటే ఎలా చిట్టి నాయుడు.'అంటూ విజయ సాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com