మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మక పథకాల్లో ప్రధానమంత్రి జన ధన్ ఖాతా పథకం ఒకటి. అయితే అనేక మంది ఖాతాదారులకు తమజన ధన్ ఖాతా ద్వారా రూ.5 వేల ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం లభిస్తుందన్న విషయం తెలియదు. దీనికి షరతు ఏమిటంటే పీఎంజేడీవై ఖాతాను ఆధార్ కార్డుతో అనుసంధానించాల్సి వస్తుంది. ఇథలా చేస్తే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ప్రయోజనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కింద, ఖాతాదారుడు తన ఖాతాలో డబ్బు లేనప్పుడు సైతం బ్యాంకు ఖాతా నుండి డబ్బులు తీసుకోవచ్చు.ఓవర్డ్రాఫ్ట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి, ఖాతాదారుడు ఖాతాను మొదటి 6 నెలలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందు కోసం, వారు తమ ఖాతాలో తగినంత డబ్బును ఉంచాలి. ఈ ఖాతాతో క్రమం తప్పకుండా లావాదేవీలు నడపాల్సి ఉంటుంది. అటువంటి ఖాతాదారులకు రుపే డెబిట్ కార్డులు జారీ చేస్తారు. ఇలా చేస్తే సంబంధిత బ్యాంకు ఖాతాదారుడికి రూ .5 వేల వరకు ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించనుంది. కొన్ని సార్లు పాక్షిక వడ్డీని చెల్లించిన సమయంలో ఈ ఓవర్డ్రాఫ్టు సౌకర్యం లభిస్తుంది. ప్రధానమంత్రి జాన్ ధన్ ఖాతా ద్వారా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్తో పాటు, ప్రమాదం కారణంగా ఖాతాదారుడు మరణించిన తర్వాత, నామినీ మొత్తం రూ .1.30 లక్షలు పొందవచ్చు.