కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని దేవనకొండ మండల పరిధిలోని గుమ్మరాళ్ల వద్ద ఆదివారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గోనెగండ్ల మండలం కైరవాడికి చెందిన మంగలి రవి, హనుమంతరెడ్డి బైక్ పై వెళుతుండగా వడ్డె రోగన్న, గంగన్నలు మరో బైక్ పై వస్తున్నారు. ఈ బైకులు గుమ్మరాళ్ల వద్ద ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై నరసింహులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.