ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుసగా రెండో రోజు హర్యానాలో స్వల్ప భూకంపం

national |  Suryaa Desk  | Published : Fri, Jun 19, 2020, 12:35 PM

హర్యానాలో వరుసగా రెండో రోజు స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున 5:37కి రోహతక్‌కి తూర్పు- ఆగ్నేయంలోని 15 కిలోమీటర్ల దూరంలో 5 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం కేంద్రీకృతమైనట్టు జాతీయ సీస్మాలజీ కేంద్రం వెల్లడించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 2.3గా నమోదైనట్టు తెలిపింది. కాగా నిన్న కూడా ఉదయం 4:18 సమయంలో రోహతక్‌ సమీపంలో భూమి కంపించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రం 2.1గా నమోదైంది. సాధారణంగా రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5 కన్నా తక్కువగా ఉంటే పెద్దగా ప్రమాదం ఉండదనీ.. బలహీన లేదా నాణ్యత లోపించిన నిర్మాణాలుంటే తప్ప వీటిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దేశ రాజధాని ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో తరచూ తక్కువ తీవ్రతతో కూడిన భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com