ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్ళైన వారానికే ఆనంతవాయువుల్లోకి...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 19, 2020, 12:22 PM

పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పూళ్ల వద్ద 16వ నంబర్‌ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నూతన వధూవరుల సహా కారు డ్రైవరు మృతి చెందారు. నూతన దంపతులైన యడ్లపల్లి వెంకటేష్ ‌(30), మానస నవ్య (26), ఆమె తమ్ముడు భరత్‌తో కలిసి గుంటూరు జిల్లా గోవాడ నుంచి విశాఖకు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో భీమడోలు సమీపంలోని పూళ్ల వద్దకు చేరుకోగానే కారు అదుపుతప్పి డివైడర్‌ మీదుగా రహదారి అవతలి వైపునకు దూసుకెళ్లింది.


అదే సమయంలో ఏలూరు వైపు వెళ్తున్న లారీ వీరి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలతో పాటు కారు డ్రైవర్‌ చంద్రశేఖర్ ‌(64)కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న ఏలూరు డీఎస్పీ దిలీప్‌ చరణ్‌ క్షతగాత్రులను స్థానికుల సాయంతో తన వాహనంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రి తరలించారు. అప్పటికే ఆ ముగ్గురూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గాయాపాలైన భరత్‌కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వెంకటేష్‌, మానసకు ఈ నెల 14న వివాహం కావడం గమనార్హం. ప్రమాద విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com