దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. నిత్యం వందల మంది వైరస్ బారిన పడి చనిపోతున్నారు. ఈ తరుణంలో ఓ నాలుగు నెలల చిన్నారి కరోనా మహమ్మారిపై విజయం సాధించింది. ఏకంగా 18 రోజులు కరోనాతో పోరాడి విజయంసాధించింది. వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ గిరిజన మహిళ లక్ష్మికి కరోనా వైరస్ సోకింది.అయితే వైద్యులు అనుమానంతో ఆమె నాలుగు నెలల చిన్నారికి సైతం కరోనా పరీక్షలు చేయగా పాజిటీవ్ వచ్చింది. దాంతో చిన్నారిని చికిత్స కోసం మే 25న విశాఖపట్నంలోని వీఐఎంఎస్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ 18 రోజుల పాటు వెంటిలేటర్పై ఉంచి చిన్నారికి చికిత్స చేశారు. దీంతో 18 రోజుల అనంతరం చిన్నారి కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకుంది. మరోసారి పరీక్షలు చేయడంతో నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ చేసి ఇంటికి తరలించారు.