కరోనాకు తమ వద్ద మందు ఉందని.. అనేక మంది ఆయుర్వేద వైద్యులు, కొందరు బాబాలు ఇటీవల వార్తల్లోకి ఎక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఓ భూత వైద్యుడు ఏకంగా ముద్దులతో కరోనాను తగ్గిస్తానని.. చివరికి అతనే కరోనాతో చనిపోవడంతో కలకలం రేగింది. దీంతో అతడితో ముద్దులు పెట్టించుకున్న వారంతా వణుకుతున్నారు.ఇప్పటికే 19 మంది భూత వైద్యుడి భక్తులకు కరోనా సోకగా.. ఇంకా ఎంతమందికి వైరస్ సోకిందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ విషాదంతో కూడిన వింత ఘటన మధ్యప్రదేశ్లో నయాపురా జిల్లా రత్లాంలో చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగారు అతని దగ్గరకు వచ్చిన మరో 29 మందిని ప్రభుత్వ క్వారంటైన్లకు తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం కరోనా హాట్ స్పాట్ గా మారింది.