కనగానపల్లి మండలం, తగరకుంట గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఆదివారం టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో గోసల బోయ రామమోహన్, చిరంజీవి, గోసే ఆదిరెడ్డి, గోసే బ్రహ్మానందరెడ్డి, తదితర ముఖ్య నాయకులు ఉన్నారు. వారికి టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న వారం రోజులు కీలకమని, సత్యకుమార్ యాదవ్ గెలుపునకు కృషి చేయాలని శ్రీరామ్ కోరారు.