ఏపీలో నేడు 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2627కి చేరింది. ఇప్పటి వరకు 1807 మంది డిశ్చార్జ్ కాగా 56 మంది మరణించారు. ప్రస్తుతం 764 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా కేసుల వివరాలకు సంబంధించి జిల్లాల వారీగా వివరాలను ఆరోగ్యశాఖ విడుదల చేయలేదు. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 11,357 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 66 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం కలవరానికి గురి చేస్తుంది.