ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా వేళ ... గర్భిణి ఆకలి చావు...

international |  Suryaa Desk  | Published : Mon, Apr 20, 2020, 12:04 PM

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు విధించిన లాక్డౌన్ మధ్య పాకిస్తాన్ లో ఆకలి చావు చోటుచేసుకుంది. మీర్పూర్ ఖాస్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జాడో పట్టణంలో 45 ఏళ్ల గర్భిణీ ఆకలితో మరణించినట్లు మీడియాకు సమాచారం అందింది. లాక్డౌన్ కారణంగా తనకు పని దొరకలేదని రుబినా అనే మహిళ భర్త అలబాఖ్ష్ తెలిపారు. అతని భార్య కూడా దీని గురించి ఆందోళన చెందింది. వారికి ఎక్కడ నుండి కూడా సహాయం అందలేదు. వారికి ఆరుగురు పిల్లలు.  తిండి లేక అతని భార్య మరణించింది. తన భార్యను ఖననం చేయడానికి కూడా  తన వద్ద డబ్బు లేదని అలబాఖ్ ఆవేదన వ్యక్తం చేశాడు దీనితో స్థానికులు ఖననం కోసం విరాళాలు సేకరించి ఆ పని పూర్తి చేశారు. పేదలకు ఉపశమనం కలిగించాల్సిన కష్ట సమయంలో పాక్ ప్రభత్వం పెద్ద వ్యాపారవేత్తలకు అండగా నిలిచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com