అరియలూర్ జిల్లాలో మెడికల్ షాపులో పనిచేస్తున్న ఇద్దరు మహిళలకు కరోనా లక్షణాలున్నట్లు పరిశోధనలో తేలింది. అరియలూరు నుంచి ఢిల్లీ వెళ్లి తిరిగొచ్చిన ఓ వ్యక్తికి మెడికల్ దుకాణం ఉంది. ఢిల్లీ వెళ్లి వచ్చిన అనంతరం అతనికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా లక్షణాలు లేవని తెలిసింది. ఈ క్రమంలో ఈ మెడికల్ షాపు లో పనిచేస్తున్న సెందురై, రాయంపురంలకు చెందిన ఇద్దరు మహిళలకు నిర్వహించిన వైద్యపరీక్షల్లో కరోనా లక్షణాలు నిర్ధా రణ అయ్యాయి. దీంతో, వారితో పాటు వారి కుటుంబ సభ్యులను అధికారులు సెందురై ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు, చికిత్సలు అందిస్తున్నారు.