లాక్డౌన్లో నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో కన్నతల్లిని కడసారి కూడా చూసుకోలేక కన్నీరుమున్నీరయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాకు చెందిన గౌరీ నాయుడు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు.కోవిద్ -19 విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ తల్లి మరణ వార్త విని, అంత్యక్రియలకు వెళ్లకపోవడమే కాక లాక్డౌన్లో భాగంగా విధులు నిర్వహించడం తోటి సిబ్బందిని సైతం కంటతడి పెట్టించింది. ఈ సంఘటనతో తోటి పోలీస్ సిబ్బంది కూడా కంటతడి పెట్టారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజి రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మఖ్బుల్ జానీ, ఎస్సైలు, కానిస్టేబుల్ లో ఆయనను ఓదార్చారు