కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండంతో ఏపీ ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. కరోనా అనుమానితులు ఉన్న ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది నోటీసులు అంటిస్తున్నారు. పాజిటివ్ వ్యక్తుల ఇళ్లకు కిలోమీటరు మేర రాకపోకలు బంద్ చేశారు. ఇంటింటికీ ర్యాపిడ్ సర్వే నిర్వహిస్తున్నారు. హాట్స్పాట్ల వద్ద మరింత అలర్ట్ ప్రకటించారు. కరోనాపై ఎప్పటికప్పడు సమీక్షలు నిర్వహిస్తూ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. కరోనా కట్టడికి మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు ఏపీ సర్కార్ సిద్దమైంది.