ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసి ప్రజలతో వీడియో ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ తాను ప్రధానిగా బిజీగా ఉన్నా, వారణాసి ఎంపీగా తాను సహ ఉద్యోగుల నుంచి సమాచారం తెలుసుకుంటున్నానని మోదీ చెప్పారు. ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, కరోనా వైరస్ పై విశ్వసనీయ సమాచారాన్ని వాట్పాప్ హెల్ప్ డెస్క్ నంబరు ద్వార అందిస్తామని ప్రధాని మోదీ వారాణసి ప్రజలకు వివరించారు.