జమ్ము కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కానున్నది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరుపుతుంది. నేషనల్ కాన్ఫరెన్స్, సజ్జాద్ లోనేకు చెందిన జమ్ము కాశ్మీర్ పీపుల్స్ ఫ్రంట్, సిపిఎం నేత మొహమ్మద్ యూసఫ్ తరిగామి తదితరులు 370 రద్దును సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు.