ఇస్రో చైర్మన్ శివన్ మంగళవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీఎస్ఎల్వీసీ-48కు ఇవాళ మధ్యాహ్నం కౌంట్డౌన్ ప్రారంభమవుతున్నారు. బుధవారం మధ్యాహ్నం 3:35 గంటలకు పీఏస్ఎల్వీసీ-48ను నింగిలోకి ప్రవేశపెడుతున్నామన్నారు. పీఎస్ఎల్వీలో ఇది 50వ రాకెట్ అని, శ్రీహరికోట కేంద్రం నుంచి 75వ రాకెట్.. అని చెప్పారు. ఇస్రో చరిత్రలో ఇదో అపూర్వ ఘట్టమని శివన్ పేర్కొన్నారు.