చిత్తూరు జిల్లాలో మరో దారుణం... 9 ఏళ్ళ బాలికపై వరుసకు చిన్నాన్న అత్యాచార యత్నానికి పాల్పడిన కేసులో జి.మునిరాజ (28) అరెస్ట్ చేసినట్లు సీఐ మధుసూదనరెడ్డి తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఎస్ఐ అనిల్కుమార్తో కలిసి విలేకరులకు సీఐ తెలిపిన వివరాలు..ఈనెల 1న కోటూరు సమీపంలోని చింతతోపులో మునిరా జ తన అన్న కుమార్తె అయిన తొమ్మిదేళ్ల బాలికను ద్విచక్ర వాహనంలో తీసుకొచ్చి అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో పరిసర ప్రాంతంలోని పశువుల కాపరులు గుర్తించి అతడిని చితకబాదారు. బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో నిందితునిపై ఫోక్సో యాక్ట్ కింద ఐపీసీ 376, 511/,5,7 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి పుంగనూరు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండుకు ఆదేశించారు.