న్యూఢిల్లి : కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి బెయిల్ ఇవ్వరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి.) సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం ఇప్పటికీ కీలక సాక్షులపై ప్రభావం చూపుతున్నారని ఇ.డి. పేర్కొంది. ఇ.డి. తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో వాదించారు.