పశ్చిమ గోదావరి జిల్లాలో 3వేల స్కూళ్లకు మహర్ధశ పట్టబోతోందని మంత్రి ఆళ్లనాని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో మనబడి నాడు-నేడు కార్యక్రమంలో మంత్రి ఆళ్లనాని పాల్గొని ప్రసంగించారు. అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశ్యంతో మనబడి కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. విద్యార్థులంతా చక్కగా చదువుకొని...ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్ధను బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందని మంత్రి నాని అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించి మన బడి కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల పాఠశాల రూపురేఖలను మార్చేయబోతోందన్నారు