న్యూఢిల్లి : కేంద్ర ఎన్నికల కమిషన్ రెండు రాజ్యసభ సీట్లకు ఉప ఎన్నికలను నిర్వహించనున్నది. ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్కొక్క రాజ్యసభ స్థానానికి డిసెంబర్ 12 ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఇ.సి. ప్రకటించింది. బిజెపి చేరిన కాంగ్రెస్ ఎంపి కెసి రామమూర్తి తన పదవికి రాజీనామా చేయడంతో కర్ణాటకలో ఒక స్థానం ఖాళీ కాగా, ఉత్తర్ ప్రదేశ్లో తజీన్ ఫాతిమా అసెంబ్లికి ఎన్నిక కావడంతో ఒక స్థానం ఖాళీ అయింది. ఈ రెండు స్థానాలకు డిసెంబర్ 12న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.