న్యూఢిల్లి : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా తాను ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2017 ఎన్నికల సమయంలో ఎన్నికల ఖర్చును కావాలనే తెలియజేయలేదని పేర్కొంటూ ఎన్నికల కమిషన్ మధు కోడాపై అనర్హత వేటు వేసింది. మధు కోడా పిటిషన్పై శుక్రవారంనాడు విచారణ జరపడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.