స్వచ్ఛభారత్ స్ఫూర్తితో స్వచ్ఛబీచ్ అభియాన్ నిర్వహిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. విశాఖ బీచ్లో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పరిసరాలను శుభ్రపరిచే ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చేనేత వస్త్రదారులు చేతి సంచులు ఉచితంగా అందిస్తామని ముందుకొస్తున్నారన్నారు.