ఐసీసీ తాజగా విడుదల చేసిన వన్డే ర్యాంకుల జాబితాలో ఇండియా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఇటీవలే ఆడిన వన్డే మ్యాచ్ ల రాంకులలో బ్యాటింగ్ విషయానికొస్తే..విరాట్ కోహ్లీ.. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా నెం.1గా కొనసాగుతున్నారు. భారత కెప్టెన్ కోహ్లీ 895 పాయింట్లతో ముందు స్థానంలో కొనసాగుతుండగా.. ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శనను కనబరిచిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రెండో స్థానం దక్కించుకున్నాడు. ఇక 797 పాయింట్లతో బుమ్రా నెం.1 దక్కించుకోగా.. నెం.2 ర్యాంకులో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ నిలిచాడు.
ఇక ఆల్ రౌండర్ల విషయానికొస్తే.. భారత్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ ప్రపంచకప్ హీరో బెన్ స్టోక్స్ 319 పాయింట్లతో మొదటి స్థానంలో నిల్చున్నాడు.. రెండో స్థానంలో అఫ్గాన్ ఆటగాడు మహ్మద్ నబీ నిలిచాడు. తాజాగా బంగ్లాదేశ్ జట్టుతో టీ-20 సిరీస్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న భారత్, త్వరలో ఆ జట్టుతో రెండు టెస్ట్ మ్యాచులు ఆడనుంది. ఆ తర్వాత డిసెంబర్లో టీం ఇండియా వెస్టిండీస్తో మూడు టీ-20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ డిసెంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్టు ఐసీసీ వెల్లడించింది .