మెట్రో రైలులో ప్రయాణికులంతా చూస్తుండగానే ఓ యువజంట ముద్దుల్లో మునిగిపోయింది. ఏ మాత్రం సిగ్గు పడకుండా లేకుండా మైట్రో రైలులో ప్రయాణికులు ఉండగానే పబ్లిగ్గా ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. వీరి ప్రవర్తనతో తోటి ప్రయాణికులు సైతం షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటన ఢిల్లీ మెట్రోలో ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. అయితే తెగ రెచ్చిపోయిన ఈ జంట బహిరంగ ముద్దులాటను తోటి ప్రయాణికులు తమ మొబైల్ కెమెరాలో బంధించారు. దీంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారాయి. మరోవైపు పబ్లిక్ ప్లేసుల్లో ఇలా చేయడంపై నెటిజన్లు యువజంటపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై ఢిల్లీ మెట్రో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.