ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులపై మహిళల దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 03, 2019, 11:09 PM

కస్టమ్స్‌ అధికారులపై కొందరు మహిళలు చేయి చేసుకున్న వైనం అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం రేపింది. వివరాల్లోకెళితే... అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులోకి దుబాయ్‌ నుంచి తిరిగొస్తున్న కొందరు మహిళలను కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు చేయగా..కొన్ని బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. దాంతో అధికారులు బంగారం తాలూకూ బిల్లులు చూపించమన్నందుకు ఆగ్రహంతో శివమెత్తిన  మహిళలు పక్కనే ఉన్న  కుర్చీలు, ఫర్నీచర్‌ ధ్వంసం చేస్తూ గలాటాకు దిగారు. ఈ క్రమంలో గొడవకు దిగిన మహిళల్లో ఒకరు కస్టమ్స్ అధికారిని భౌతికంగా దాడిచేసార. అంతే కాకుండా మహిళల భర్తలు సైతం అదే స్థాయిలో గొడవకు దిగి నానా బీభత్సం సృష్టించారని కస్టమ్స్ అధికారులు తెలిపారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని తగిన చర్యలు తీసుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com