అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామం లో కరెంట్ షాక్ కు గురై గీత కార్మికుడు మృతి చెందారు. మహేంద్రవాడ అ కాలనీ లోని కొబ్బరి చెట్టు పైనుండి కాయలు తీస్తుండగా పక్కనే ఉన్న కరెంటు షాక్ కు గురై అదే గ్రామానికి చెందిన చిట్టూరి భాస్కర్ రావు 51 అక్కడికక్కడే మృతి చెందారు .ఈయనకు భార్య. ముగ్గురు కుమార్తెలు సంతానం కలరు. కుటుంబాన్ని పోషించే పెద్దదిక్కు కోల్పోవడంతో కుటుంబసభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రమాద వార్త తెలియడంతో బంధువులు స్నేహితులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మృతదేహం వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయి నిరుపేద కుటుంబానికి చెందిన భాస్కర్ రావడంతో కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.