ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక పరుగుల వరదే.. ఆసీస్ టీ20 జట్టులోకి వార్నర్, స్మిత్

international |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2019, 06:31 PM

బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి ఏడాది పాటు నిషేధానికి గురైన ఆసీస్ స్టార్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఇటీవల టెస్టు జట్టులో చోటు సంపాదించుకున్నారు. ఇంగ్లండ్‌తో ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్‌లో స్మిత్ ఇరగదీయగా, వార్నర్ మునుపటి ఫామ్‌ను అందుకునేందుకు తంటాలు పడ్డాడు. తాజాగా వీరికి పొట్టి ఫార్మాట్‌లోనూ చోటు లభించింది. ఈ నెల 27 నుంచి శ్రీలంకతో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ప్రకటించిన జట్టులో వీరిద్దిరికీ స్థానం లభించింది. అరోన్ ఫించ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. కాగా, బాల్ ట్యాంపరింగ్‌లో దొరికిపోయిన స్మిత్ మార్చి వరకు ఎటువంటి నాయకత్వ బాధ్యతలు వహించడానికి వీల్లేదు. ఫించ్‌తో కలిసి వార్నర్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుండగా, స్మిత్ ఫస్ట్ డౌన్‌లో దిగనున్నాడు. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్‌లు బౌలింగ్ ఎటాక్ చేయనున్నారు.


 ఆస్ట్రేలియా జట్టు: అరోన్‌ఫించ్ (కెప్టెన్), ఆష్టన్ అగర్, అలెక్స్ కేరీ, పాట్ కమిన్స్, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ మెక్‌డెర్మట్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, బిల్లీ స్టాన్‌లేక్, మిచెల్ స్టార్క్, ఆష్టన్ టర్నర్, ఆండ్రూ టై, డేవిడ్ వార్నర్, ఆడం జంపా






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com