చైనాలోని చెంగ్డు రాష్ట్ర కేంద్రంలో జరిగిన ప్రపంచ పోలీస్ మరియు ఫైర్ గేమ్స్- 2019లో టిటిడిలో అలిపిరి చెక్ పాయింట్ ఎవిఎస్ ఓగా విధులు నిర్వహిస్తున్న అల్లం సురేంద్ర బంగారు, వెండి పతకాలు సాధించారు. ఈ సందర్భంగా టిటిడి సివిఎస్ ఓ గోపీనాథ్ జెట్టి బుధవారం ఆయన్ను అభినందించారు.ఆగస్టు 8 నుండి 18వ తేదీ వరకు ఈ క్రీడాపోటీలు జరిగాయి. 40 ఏళ్ల కేటగిరీలో టెన్నిస్ డబుల్స్ పోటీల్లో బంగారు పతకం, సింగిల్స్ పోటీల్లో వెండి పతకం సాధించారు.