సీనియర్ ఐఏఎస్ అధికారిణి, తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల శాఖ ముఖ్యకార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్లో డిప్యుటేషన్పై పనిచేయడా నికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఆమెను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 1988 బ్యాచ్కి చెందిన ఆమె డిప్యుటేషన్పై ఆంధ్రప్రదేశ్కు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దీనిని పరిశీలించిన అనంతరం కేంద్రం తాజాగా అంగీకారం తెలిపింది. శ్రీలక్ష్మికి 2026వ సంవత్సరం వరకు సర్వీసు ఉంది.