ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి రాజీనామా చేశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆమె రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ హరిచందన్ కు పంపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన హయాంలో ఎందరో బాధిత మహిళలకు అండగా నిలిచానని చెప్పారు. మూడేళ్ల రిపోర్టును గవర్నర్ కు అందజేశానని తెలిపారు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలని... అప్పుడే నేరాలు తగ్గుతాయని చెప్పారు.