ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసిన నన్నపనేని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 07, 2019, 02:15 PM

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి రాజీనామా చేశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆమె రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ హరిచందన్ కు పంపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన హయాంలో ఎందరో బాధిత మహిళలకు అండగా నిలిచానని చెప్పారు. మూడేళ్ల రిపోర్టును గవర్నర్ కు అందజేశానని తెలిపారు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలని... అప్పుడే నేరాలు తగ్గుతాయని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com