ఇసుకపై వైసీపీ నాయకులు పదిరెట్లు దోచేస్తున్నారని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు అన్నారు. గుంటూరులో వేమూరు నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 20లక్షల కుటుంబాలకు పని లేకుండా పోయిందన్నారు. అసెంబ్లీలో అవమానిస్తున్నారు… భరిస్తున్నామని… భయపడేదే లేదన్నారు. తన సెక్యూరిటీ కోసం తాను కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు. గోదావరి నీళ్లను శ్రీశైలంలో పోస్తారంట అని అన్నారు. చెన్నై కి తెలుగుగంగ నీళ్లు ఇవ్వడానికి నలుగురు సీఎంలు మారారని అన్నారు. తమ హయాంలో అవినీతి జరిగిందని వెతుకుతున్నారన్నారు. రాష్ట్రమంతా పులివెందుల పంచాయతీ చేస్తారా అని జగన్ ను ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెడితే తిరిగి కేసులు పెడతామన్నారు. పోలీసులు కేసులు తీసుకోకుంటే కోర్టుకు వెళ్తామన్నారు.