ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరద బాధితులకు కార్యకర్తలు అండగా ఉండాలి: చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 04, 2019, 11:42 AM

వరద బాధితులకు టీడీపీ కార్యకర్తలు అండగా ఉండాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈరోజిక్కడ చంద్రబాబు మాట్లాడుతూ సహాయ చర్యల్లో టీడీపీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలన్నారు. గోదావరి వరద ఉధృతి కారణంగా ఉభయ గోదావరి జిల్లాల ముంపు మండలాల ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతమన్నారు. పొలాల్లోకి వరద నీరు చేరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. మిర్చి, అరటితోటలు, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com