వరద బాధితులకు టీడీపీ కార్యకర్తలు అండగా ఉండాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈరోజిక్కడ చంద్రబాబు మాట్లాడుతూ సహాయ చర్యల్లో టీడీపీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలన్నారు. గోదావరి వరద ఉధృతి కారణంగా ఉభయ గోదావరి జిల్లాల ముంపు మండలాల ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతమన్నారు. పొలాల్లోకి వరద నీరు చేరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. మిర్చి, అరటితోటలు, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు.