ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో సంక్లిష్ట పరిస్థితుల్లో స్పీకర్ వ్యవస్థ: స్పీకర్ తమ్మినేని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 04, 2019, 11:44 AM

ప్రస్తుతం మన దేశంలో స్పీకర్ వ్యవస్థ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం. స్పీకర్ వ్యవస్థపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యస్థలతో పాటు ఫోర్త్ ఎస్టేట్ గా మీడియా ఉందని, మీడియా క్రియాశీలక పాత్ర పోషించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. వ్యవస్థలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, నాలుగు వ్యవస్థలకంటే పౌర వ్యవస్థ అనే మరో శక్తివంతమైన వ్యవస్థ ఉందని, శాసన సభా అద్దంలాంటిదని, ఇక్కడ చెప్పేవే ప్రజలకు ప్రతిభింబిస్తుందన్నారు. మనందరినీ పౌరవ్యస్థ గమనిస్తుందనే విషయాన్ని మనం గమనించుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com