ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ ట్విట్టర్ వేదికగా "గౌరవనీయ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారూ, మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించేలా దీవించాలని కోరుకుంటున్నాను" అంటూ జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం జగన్ తన కుటుంబంతో కలిసి జెరూసలెం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన 5వ తేదీన రాష్ట్రానికి చేరుకునే అవకాశాలున్నాయి.