ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబై బస్సులోకి చేరిన వర్షపు నీరు..

national |  Suryaa Desk  | Published : Sat, Aug 03, 2019, 03:11 PM

నిర్విరామంగా కురుస్తున్న వర్షాలకు మహారాష్ట్రలోని ముంబై వణికిపోతోంది. వరుణుడు తన ప్రతాపాన్ని చూపడంతో నగరంలోని పలు ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. భారీ వర్షానికి వరదనీరు బీఎంసీ బస్సులోకి వచ్చేశాయి. దీంతో పలువురు ప్రయాణికులు బస్సులోని వెనుక భాగానికి వచ్చేయగా, కొందరు మాత్రం బస్సు ముందు భాగంలోనే కూర్చున్నారు. దీనికితోడు రాబోయే 4-5 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను బీఎంసీ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com