అమరావతి: కొత్త మంత్రుల జాబితా సీఎం జగన్ సిద్దం చేశారు. కాగా నేడు వైఎస్సార్ ఎల్ఫీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి 151 మంది ఎమ్యెల్యే లు,ఎమ్యెల్సీ లు,పార్టీ సీనియర్ నేతలు హాజరుకానున్నారు. మంత్రుల ఎంపికపై ఈ సమావేశంలో జగన్ ప్రకటన చేయనున్నారు. 25 మందితో క్యాబినెట్ ఉంటుందంటున్న పార్టీ నేతలు. క్యాబినెట్ లో బెర్త్ కోసం జిల్లాకు ఇద్దరు ముగ్గురు ఆశావహులు. మంత్రులుగా ఎంపిక ఏ ప్రాతిపదికన చేసింది ఎమ్యెల్యేలకు వివరించనున్న జగన్. ఆశావహులు ను సంతృప్తి పరిచేలా ఎల్ఫీ సమావేశంలో ప్రకటన చేయనున్న సీఎం జగన్. అంతేకాదు సాయంత్రం 5:30 ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విజయవాడకు రానున్నారు. రేపు ఉదయం అమరావతిలో కొత్తమంత్రుల ప్రమాణస్వీకారం చేయించనున్నరు.