మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బంధూప్ ప్రాంతంలో గురువారం రాత్రి దారుణం జరిగింది. ముప్పై ఏళ్ల వయసున్న క్రికెటర్ రాకేశ్ పన్వార్ను గుర్తు తెలియని ముగ్గురు దుండగులు కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాకేశ్ హత్యపై అతని స్నేహితుడు గోవింద్ రాథోడ్ మాట్లాడుతూ.. రాకేశ్ అతని ప్రియురాలితో ఉన్నప్పుడు ఈ హత్య జరిగిందని తెలిపారు. ఖాన్ కుటుంబంతో రాకేశ్కు శత్రుత్వం ఉందని.. వారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని గోవింద్ అనుమానం వ్యక్తం చేశారు. అయితే రాకేశ్ యువ క్రికెటర్లకు శిక్షణ కూడా ఇస్తున్నట్లు గోవింద్ పేర్కొన్నారు.