ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూన్ 6 కల్లా కేర‌ళ‌ను తాక‌నున్ననైరుతి రుతుపవనాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 01, 2019, 09:35 PM

దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, జూన్-సెప్టెంబర్ మధ్య 96శాతం వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 6న కేరళ తీరాన్ని తాకే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు రుతుపవనాలు బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్నాయని, ఇప్పటికే అండమాన్‌ దీవులను దాటాయని వెల్లడించారు.


శుక్రవారం విడుదల చేసిన రెండో దశ నివేదిక ప్రకారం.. వాయువ్య భారతంలో 94శాతం, మధ్యభారతంలో 100శాతం, దక్షిణాదిలో 97శాతం, తూర్పు భారతంలో 91శాతం వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ పేర్కొంది. ఖరీఫ్‌కు కీలకమైన జులై, ఆగస్టు నెలల్లో వర్షాలు బాగా కురుస్తాయని వెల్లడించింది. ఫసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి ముగిసేవరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలుస్తోంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com