ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశంలోని 11 రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహణ జరుగుతుంది. మొత్తం 1,611 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 15.52 కోట్ల మంది ఓటర్లు ఓటింగ్లో పాల్గొననున్నారు. వీరిలో పురుష ఓటర్లు 7.89 కోట్లు, మహిళా ఓటర్లు 7.63 కోట్లు. తమిళనాడు-38, కర్ణాటక-14, మహారాష్ట్ర-10, ఉత్తరప్రదేశ్-8, అసోం, బిహార్, ఒడిశాల్లో 5 సీట్ల చొప్పున, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో 3 సీట్ల చొప్పున, జమ్ముకశ్మీర్లో 2 సీట్లు, మణిపూర్, పుదుచ్చేరిలో ఒక్కో సీటుకు పోలింగ్ జరుగుతుంది. దీంతో పాటు ఓడిశాలో 35 శాసనసభ స్థానాలకు, తమిళనాడులో ఖాళీగా ఉన్న 18 శాసనసభ స్థానాలకు, పుదుచ్చేరిలో ఒక శాసనసభ స్థానానికి పోలింగ్ నిర్వహణను ఎన్నికల అధికారులు చేపట్టారు.